కేఏ పాల్ బాగోతం బట్టబయలు

ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకుని మొన్నటివరకు ఎన్నికల్లో హడావుడి చేసిన ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్ విజిటింగ్ వీసా ఇప్పిస్తానని చెప్పి బురిడీ కొట్టించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. [more]

Update: 2019-05-28 11:14 GMT

ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకుని మొన్నటివరకు ఎన్నికల్లో హడావుడి చేసిన ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్ విజిటింగ్ వీసా ఇప్పిస్తానని చెప్పి బురిడీ కొట్టించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళకు అమెరికా వెళ్లడానికి విజిటింగ్ వీసా కోసం ప్రయత్నించగా రెండుసార్లు రిజక్ట్ అయ్యింది. దీంతో ఎవరైనా అమెరికాలో పలుకుబడి ఉన్న వారు స్పాన్సర్ షిప్ చేస్తే వీసా వస్తుందని చెప్పడంతో సదరు మహిళ కేఏ పాల్ ను ఆశ్రయించారు. ఒక ఎవాంజలిస్ట్ గా ఆయన స్పాన్సర్ షిప్ చేస్తే విజిటింగ్ వీసా వస్తుందని ఆమె కేఏ పాల్ ను కోరారు. రూ.15 లక్షలు ఇస్తేనే స్పాన్సర్ షిప్ లెటర్ ఇస్తానని కేఏ పాల్ చెప్పగా చివరకు రూ.2 లక్షలకు బేరం కుదిరింది. సదరు మహిళ కేఏ పాల్, ఆయన పీఏ జ్యోతికి రూ.2 లక్షలు ముట్టజెప్పగా అప్పటి నుంచి ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. తర్వాత మళ్లీ ఆమె అడగగా మొత్తం రూ.15 లక్షలు ఇవ్వాల్సిందేనని కేఏ పాల్ చెప్పారు. దీంతో తనను మోసం చేశారని గుర్తించిన సదరు మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేఏ పాల్ పై క్రిమినల్ కేస్ నమోదు చేశారు.

Tags:    

Similar News