Cr : అందుకే చంద్రబాబు దొంగ దీక్షలు

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అనేక మంది నేతలు పార్టీని వీడుతుండటంతోనే చంద్రబాబు దీక్షల డ్రామాకు తెరతీశారని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య  అన్నారు. పట్టాభి తెలుగుదేశం పార్టీ లో [more]

Update: 2021-10-21 06:28 GMT

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అనేక మంది నేతలు పార్టీని వీడుతుండటంతోనే చంద్రబాబు దీక్షల డ్రామాకు తెరతీశారని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. పట్టాభి తెలుగుదేశం పార్టీ లో ఒక చిన్న స్థాయి లీడర్ అని, అతని చేత ముఖ్యమంత్రిని దుర్భాషలాడించి అరాచకం సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నించారన్నారు. నేతలు, క్యాడర్ పార్టీలో నిస్తేజంతో ఉండటంతోనే చంద్రాబాబులో అసహనం కట్టలు తెంచుకుంటుందని సి.రామచంద్రయ్య అన్నారు. సమాజం ప్రశాతంగా ఉండాలని చంద్రబాబు ఎప్పుడూ కోరుకోరన్నారు. టీడీపీకి రాష్ట్రంలో భవిష్యత్ లేదని, చంద్రబాబు డ్రామాలను ప్రజలు ఎవరూ నమ్మరని సి.రామచంద్రయ్య అన్నారు.

Tags:    

Similar News