41 వేల కోట్లకు లెక్కలివిగో.. పయ్యావులకు బుగ్గన కౌంటర్

నలభై వేల కోట్లకు లెక్కలు ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. రికార్డులు పక్కాగా ఉన్నాయన్నారు. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ [more]

Update: 2021-07-13 05:55 GMT

నలభై వేల కోట్లకు లెక్కలు ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. రికార్డులు పక్కాగా ఉన్నాయన్నారు. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారనడం అవాస్తవమని బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లేఖలు రాయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితిపై అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారని బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అన్నారు. పయ్యావుల విమర్శలు నిజమైతే మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎందుకు మౌనంగా ఉన్నారని బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అన్నారు. సందేహాలు ఉంటే ప్రభుత్వం నుంచి క్లారిటీ తీసుకోవాలి గాని, ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి సూచించారు. ఎలాంటి అవకతవకలు జరగలేదని, కావాలంటే ఎక్కడైనా చర్చకు సిద్ధమని బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ అప్పును కూడా కలుపుకున్నామని చెప్పడం అవాస్తవమని చెప్పారు.

Tags:    

Similar News