నువ్వు బెజవాడ వస్తే… నేను హైదరాబాద్ వస్తా

తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడకి వచ్చి రాజకీయం చేస్తే తాను హైదరాబాద్ వచ్చి రాజకీయం చేస్తానని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. చంద్రబాబు జాతీయ స్థాయి [more]

Update: 2019-01-18 11:26 GMT

తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడకి వచ్చి రాజకీయం చేస్తే తాను హైదరాబాద్ వచ్చి రాజకీయం చేస్తానని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. చంద్రబాబు జాతీయ స్థాయి నేత అని, దేశంలోని మోదీ వ్యతిరేక శక్తులన్నీ చంద్రబాబు నాయకత్వాన్ని ఒప్పుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఏర్పడుతున్న మహాకూటమిని విచ్ఛిన్నం చేయడానికే మోదీ ఆధ్వర్యంలో కేసీఆర్, జగన్ ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారని ఆరోపించారు. బీసీలను అడ్డు పెట్టుకుని తలసాని శ్రీనివాస్ యాదవ్ కోట్లు కూడబెట్టారని పేర్కొన్నారు. బీసీలకు ఏపీలో నాయకత్వం లేదనడం సరికాదని, ఏపీలో ఎక్కువ బీసీ నాయకులు ఉన్నారో తెలంగాణలో ఎక్కువ మంది ఉన్నారో చర్చ పెడదామా అని సవాల్ విసిరారు.

Tags:    

Similar News