మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృవియోగం

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి మృతి చెందారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బొత్స [more]

Update: 2020-08-16 02:03 GMT

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి మృతి చెందారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ మృతి చెందారు. ఆమెకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. బొత్స సత్యనారా‍యణ పెద్ద కుమారుడు. తల్లి మృతితో బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం అలుముకుంది. నేడు విజయనగరంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

Tags:    

Similar News