బ్రేకింగ్ : విశాఖలో త్వరలోనే జగన్ శంకుస్థాపన

త్వరలోనే విశాఖలో పరిపాలన రాజధానికి జగన్ శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉత్తరాంధ్ర,రాయలసీమ అభివృద్ధిని ఇక వేగవంతం చేస్తామన్నారు. గవర్నర్ మూడు రాజధానుల బిల్లులను [more]

Update: 2020-07-31 12:56 GMT

త్వరలోనే విశాఖలో పరిపాలన రాజధానికి జగన్ శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉత్తరాంధ్ర,రాయలసీమ అభివృద్ధిని ఇక వేగవంతం చేస్తామన్నారు. గవర్నర్ మూడు రాజధానుల బిల్లులను ఆమోదించడం శుభపరిణామని బొత్స తెలిపారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా గవర్నర్ ప్రజలకు శుభవార్తను అందించారని చెప్పారు. గవర్నర్ నిర్ణయంతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా మూడు రాజధానుల బిల్లులు ఆగలేదని బొత్స తెలిపారు. అమరావతిని కూడా తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని బొత్స తెలిపారు.

Tags:    

Similar News