అమరావతిలో భూములు కొన్న వైైసీపీ నేతలు వీరే

రాజధాని అమరావతిలో కేవలం టీడీపీ నేతలే కాదని, వైసీపీ నేతలు కూడా భూములు కొనుగోలు చేశారన్నారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని [more]

Update: 2020-01-02 13:18 GMT

రాజధాని అమరావతిలో కేవలం టీడీపీ నేతలే కాదని, వైసీపీ నేతలు కూడా భూములు కొనుగోలు చేశారన్నారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్రావు, ఉండవల్లి శ్రీదేవి భర్తతో పాటు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏసురత్నం కూడా భూములు కొనుగోలు చేశారని బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ పార్టీ కార్యాలయానికి తాను వస్తానని, చర్చకు సిద్ధంగా ఉన్నారా? అని బోండా సవాల్ విసిరారు. అమరావతిని తరలించడానికే ఇన్ సైడర్ ట్రేడింగ్ అని ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ ఏ విచారణకు అయినా సిద్ధమన్నారు. తమ వద్ద వైసీపీ నేతలు భూములు కొనుగోలు చేసిన దానిపై ఆధారాలున్నాయన్నారు. పవన్ కల్యాణ్ ను విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదన్నారు. మీరు జగన్ పెంపుడుకుక్కలని బోండా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైనా డౌట్ ఉంటే మీ డీఎన్ఏలు చెక్ చేయించుకోవచ్చని అన్నారు.

Tags:    

Similar News