బ్రేకింగ్ : బొమ్మిరెడ్డి జంప్...!!

Update: 2018-11-06 03:49 GMT

నెల్లూరులో ఊహించినట్లే జడ్పీ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయ కర్తగా నిన్న మొన్నటి వరకూ రాఘవేంద్రరెడ్డి ఉన్నారు. అయితే ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడంతో వైసీీపీ అధినేత జగన్ ఆనం రామనారాయణరెడ్డిని వెంకటగిరి సమన్వయ కర్తగా నియమించారు. దీనిపై అలక చెందిన బొమ్మిరెడ్డి వైఎస్ జగన్ పై ఘాటు విమర్శలు కూడా చేశారు. బొమ్మిరెడ్డి గత కొంతకాలంగా టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారు. ఆయన ఆత్మకూరు నియోజకవర్గం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద బొమ్మిరెడ్డి టీడీపీలో చేరికతో పార్టీ బలోపేతం అవుతుందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి.

Similar News