పవన్ పై బీజేపీ నేత సంచలన కామెంట్స్

మొన్నటి వరకూ టీడీపీ ఎమ్మెల్సీ… నేడు బీజేపీ నేత అన్నం సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే డిసెంబరులోగా జనసేన భారతీయ జనతా పార్టీలో కలసి పోతుందని [more]

Update: 2019-09-04 07:20 GMT

మొన్నటి వరకూ టీడీపీ ఎమ్మెల్సీ… నేడు బీజేపీ నేత అన్నం సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే డిసెంబరులోగా జనసేన భారతీయ జనతా పార్టీలో కలసి పోతుందని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. పవన్ సీఎం కావాలంటూ అన్నం సతీష్ కుమార్ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లవచ్చని, అక్కడి నేతలు ఇక్కడకు రావచ్చని అన్నం సతీష్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన వస్తుందని జగన్ జాగ్రత్త పడుతున్నారన్నారు. పవన్ సీఎం అయితే చూడాలని ఉందని అన్నం సతీష్ వ్యాఖ్యానించారు. పవన్ కు పెద్ద ఎనర్జీ వస్తుందని, దానిని ఎవరూ ఆపలేరని అన్నం సతీష్ వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయం వచ్చినప్పుడు బ్యాక్ బోన్ ఎవరో తెలుస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు జనసేనలోనూ, అటు బీజేపీలోనూ కలకలం రేపుతున్నాయి.

Tags:    

Similar News