బీజేపీ మ్యానిఫేస్టోను విడుదల చేసిన ఫడ్నవిస్

హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మ్యానిఫేస్టోను బీజేపీ విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మ్యానిఫేస్టోను విడుదల చేశారు. వరద బాధితులకు 25 వేల [more]

Update: 2020-11-26 07:39 GMT

హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మ్యానిఫేస్టోను బీజేపీ విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మ్యానిఫేస్టోను విడుదల చేశారు. వరద బాధితులకు 25 వేల సాయం అందిస్తామని చెప్పారు. బడి పిల్లలందరికీ ఉచితంగా ట్యాబ్ లు ఇస్తామని పేర్కొంది. కరోనా వైరస్ టీకాను జీహెచ్ఎంసీ ద్వారా అందరికి ఉచితంగా పంపిణీ చేస్తామని మ్యానిఫేస్టోలో పేర్కొంది. ప్రజలపై భారం వేస్తున్న ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామని మ్యానిఫేస్టోలో పేర్కొంది. 125 గజాలలో పు ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా అనుమతులు ఇస్తుంది. సెప్టంబరు 17 న జీహెచ్ఎంసీ పరిధిలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. లక్షమంది పేదలకు ప్రధాని ఆవాజ్ యోజన కింద ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు. మెట్రో, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని చెప్పారు.

Tags:    

Similar News