రాజధానిలో భువనేశ్వరి

రైతుల దీక్షకు మద్దతుగా రేపు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ గత పథ్నాలుగు రోజులుగా రైతులు దీక్షలు చేస్తున్న [more]

Update: 2019-12-31 07:40 GMT

రైతుల దీక్షకు మద్దతుగా రేపు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ గత పథ్నాలుగు రోజులుగా రైతులు దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రేపు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోకూడదని చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో నారా భువనేశ్వరి రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు సంఘీభావం ప్రకటిస్తారు. అంతే కాకుండా రేపు చంద్రబాబు, భువనేశ్వరిలు రైతులతో పాటు దీక్షలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News