భూమా అఖిలకు షాకిచ్చిన బ్రదర్

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సొంత తమ్ముడు షాకిచ్చారు. ఒక భూవివాదంలో తన ఇద్దరు అక్కలపై భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టుకు ఎక్కారు. [more]

Update: 2019-11-22 04:58 GMT

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సొంత తమ్ముడు షాకిచ్చారు. ఒక భూవివాదంలో తన ఇద్దరు అక్కలపై భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టుకు ఎక్కారు. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎకరాల భూమిని భూమానాగిరెడ్డి బతికి ఉన్నప్పుడే రెండు కోట్ల రూపాయలకు విక్రయించారు. అయితే అప్పుడు మైనర్ గా ఉన్న విఖ్యాత్ రెడ్డి రిజిస్ట్రేషన్ సమయంలో వేలి ముద్ర మాత్రమే వేశారు. అయితే తనకు తెలియకుండా భూ విక్రయం జరిగిందని విఖ్యాత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. అయితే భూమి కొనుగోలు దారులను ఇబ్బంది పట్టేందుకే విఖ్యాత్ రెడ్డి సొంత అక్కలపై కేసు వేశారన్న వాదన కూడా ఉంది. మరోవైపు అఖిలప్రియ తనతో పాటు తన సోదరుడు ముంబయిలో ఉన్నారని, తమ మధ్య భూ వివాదాలు లేవని చెబుతున్నారు. ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది సయితం భూమా అఖిలప్రియ బంధువే కావడం విశేషం.

Tags:    

Similar News