భానుకిరణ్ కు జైలు శిక్ష

Update: 2018-05-09 08:39 GMT

మద్దెల చెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్ కు అక్రమ ఆయుధాల వినియోగంపై నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే 2009లో భాను కిరణ్ అక్రమంగా ఆయుధాలు వినియోగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు కోర్టు తీర్పు చెప్పింది. భాను కిరణ్ తో పాటు మరో ఇద్దరికీ ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అయితే మద్దెల చెరువు సూరి హత్య కేసులో భానుకిరణ్ అయిదేళ్లుగా జైలులోనే ఉన్నారు.

Similar News