గాంధీ ఆసుపత్రిలో బెడ్స్ లేవ్

గాంధీ ఆస్పత్రిలో బెడ్ ను పూర్తిగా నిండిపోయాయి . కొత్త కరోనా రోగులకు అడ్మిషన్లను పూర్తిగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో కరోనా తో బాధపడుతున్న పేషెంట్లు నానా [more]

Update: 2021-04-29 02:15 GMT

గాంధీ ఆస్పత్రిలో బెడ్ ను పూర్తిగా నిండిపోయాయి . కొత్త కరోనా రోగులకు అడ్మిషన్లను పూర్తిగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో కరోనా తో బాధపడుతున్న పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా నగరంతోపాటు గా తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గాంధీ ఆసుపత్రికి కరోనా రోగులు వస్తుంటారు.గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం సకల వైద్య సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత మూడు రోజుల నుంచి కరోనా రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో ఉన్న అన్ని బెడ్స్ పూర్తి గా నిండిపోయాయి. దీంతో కొత్త పేషెంట్లకు గాంధీ సిబ్బంది అడ్మిషన్ ఇవ్వకుండా నిరాకరిస్తోంది . ఈనేపథ్యంలో దాదాపుగా 30కిపైగా అంబులెన్సులు గాంధీ ఆస్పత్రి బయట అడ్మిషన్ కోసం రోగులతో వేచి చూస్తున్నారు. తమను చేర్చు కోవాలంటూ రోగుల బంధువులు గాంధీ ఆసుపత్రి సిబ్బందిరి ప్రాధేయ పడుతున్నారు. అంబులెన్స్ లోనే ఉంచి అందరి కూడా చికిత్స నిర్వహిస్తున్నారు . అంబులెన్స్ లో ఉండి అవస్థలు పడుతున్న పేషెంట్లను వివిధ ప్రాంతాలకు తరలించేందుకు గాంధీ ఆసుపత్రి సిబ్బంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు .అయితే చాలామంది కూడా గాంధీ ఆస్పత్రిలో అడ్మిషన్ కావాలంటూ అక్కడే ఉండిపోయారు.

Tags:    

Similar News