Badvel : కౌంటింగ్ మూడు గంటల్లో పూర్తయ్యేలా

బద్వేలు ఉప ఎన్నిక కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరవై [more]

Update: 2021-11-02 01:25 GMT

బద్వేలు ఉప ఎన్నిక కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరవై రౌండ్ల వరకూ లెక్కించే అవకాశముంది. ఇందుకోసం నాలుగు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఇరవై నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింట్ రెండు, మూడు గంటల్లో పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

మూడంచెల భద్రత….

తొలుత పోస్టల్ బ్యాలట్ లను లెక్కిస్తారు. మొత్తం 1,46,660 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద విస్తృతమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 400 మంది పోలీసులను నియమించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు.

Tags:    

Similar News