ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

ప్రతిపక్షనేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. [more]

Update: 2019-09-19 10:11 GMT

ప్రతిపక్షనేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోడెలపై 18 తప్పుడు కేసులు పెట్టారని వెల్లడించారు. ఎక్కవ శిక్షపడాలని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సైతం పెట్టి వేధించారని చంద్రబాబు వైసీపీ సర్కార్ పై ధ్వజమెత్తారు. దేశ రాజకీయాల్లోనే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య ఓ కేస్ స్టడీ అని చంద్రబాబు చెప్పారు. అంతకు ముందు చంద్రబాబు బృందం గవర్నర్ విశ్వభూషన్ కు ప్రభత్వ అక్రమ కేసులపై ఫిర్యాదు చేశారు. 13పేజీలతో వినతి పత్రం అందజేశారు.

 

Tags:    

Similar News