ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై దాడి..!

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ పై మరోసారి దాడి జరిగింది. ఇవాళ ఈస్ట్ ఢిల్లీలో ఎన్నికల ప్రచారసభలో భాగంగా ఆయన రోడ్ [more]

Update: 2019-05-04 12:57 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ పై మరోసారి దాడి జరిగింది. ఇవాళ ఈస్ట్ ఢిల్లీలో ఎన్నికల ప్రచారసభలో భాగంగా ఆయన రోడ్ షో నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వాహనం ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంపపై కొట్టారు. కేజ్రీవాల్ పై ఇంతకుముందు కూడా పలుమార్లు దాడులు జరిగాయి. ఆయనపై గతంలో ఇంక్, కారం, చెప్పుతో కూడా దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కాగా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై తరచూ దాడి జరగడంపై పూర్తిగా భద్రతా వైఫల్యంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News