ఎక్కడ ఆగిపోయాయో? అక్కడి నుంచే?

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్ నోటిఫికేషన్ జారీ చేశారు. కోర్టులో [more]

Update: 2020-05-06 13:48 GMT

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్ నోటిఫికేషన్ జారీ చేశారు. కోర్టులో కేసులు ఉండటం, లాక్ డౌన్ కారణంగా ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు కనగరాజ్ తెలిపారు. అయితే ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే మొదలవుతుందని కనగరాజ్ నోటిఫికేషన్ లో వెల్లడించారు. ఏప్రిల్ 30వ తేదీతో ఎన్నికల వాయిదా గడువు ముగియడంతో కనగరాజ్ మరోసారి నోటిఫికేషన్ జారీ చేశారు.

Tags:    

Similar News