డాక్టర్ రమేష్ విచారణకు హైకోర్టు ఓకే

స్వర్ణ ప్యాలెస్ ఘటనలో డాక్టర్ రమేష్ ను విచారించేందుకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. ఆయనను న్యాయవాది సమక్షంలో విచారణ చేయవచ్చని పేర్కొంది. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో దాదాపు [more]

Update: 2020-11-27 06:56 GMT

స్వర్ణ ప్యాలెస్ ఘటనలో డాక్టర్ రమేష్ ను విచారించేందుకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. ఆయనను న్యాయవాది సమక్షంలో విచారణ చేయవచ్చని పేర్కొంది. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో దాదాపు పది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే స్వర్ణ ప్యాలెస్ లో నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ రమేష్ కోవిడ్ సెంటర్ ను నిర్వహిస్తున్నారని ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసింది. దీంతో డాక్టర్ రమేష్ తనను అరెస్ట్ చేయకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అయితే తాజాగా హైకోర్టు రమేష్ బాబును విచారించవచ్చని తెలిపింది. నవంబరు 30 నుంచి డిసెంబరు 3వరకూ విచారణ చేయవచ్చని పేర్కొంది.

Tags:    

Similar News