సుప్రీంకోర్టుకు జగన్ సర్కార్

హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. న్యాయనిపుణులతో ఇప్పటికే చర్చించిన ప్రభుత్వం రేపు సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ [more]

Update: 2021-01-21 07:47 GMT

హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. న్యాయనిపుణులతో ఇప్పటికే చర్చించిన ప్రభుత్వం రేపు సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుండటం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంతో కనీస సంప్రదింపులు జరపకుండా షెడ్యూల్ ను విడుదల చేయడంపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నికల విధులు నిర్వహించేందుకు సుముఖంగా లేరన్న విషయం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. ఈ మేరకు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటీషన్ ఫైల్ చేయడానికి సిద్దమయ్యారు.

Tags:    

Similar News