నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం.. రాజధాని తరలింపుపై

నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ [more]

Update: 2020-08-19 02:35 GMT

నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ ఆసరా పథకంపై చర్చించనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద రానున్న నాలుగేళ్లలో 27 వేల కోట్ల లబ్ది చేకూరనుంది. దీంతో పాటు నూతన పారిశ్రామిక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే వచ్చే సెప్టంబరు 5వ తేదీన ఇవ్వనున్న వైఎస్సార్ విద్యాకానుకకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు రాజధాని తరలింపు ప్రక్రియపై కూడా కేబినెట్ చర్చించే అవకాశముంది.

Tags:    

Similar News