ఎన్డీఏ కు మరో షాకింగ్ న్యూస్….!!

భారతీయ జనతా పార్టీకి వరుస షాక్ లు తప్పడం లేదు. ఇప్పటికే వరుసగా మిత్ర పక్షాలు దూరమయిపోతున్నాయి. మరో పార్టీ కూడా అదేరకమైన సంకేతాలను పంపింది. మిత్రపక్షాలను [more]

Update: 2018-12-27 12:04 GMT

భారతీయ జనతా పార్టీకి వరుస షాక్ లు తప్పడం లేదు. ఇప్పటికే వరుసగా మిత్ర పక్షాలు దూరమయిపోతున్నాయి. మరో పార్టీ కూడా అదేరకమైన సంకేతాలను పంపింది. మిత్రపక్షాలను నిర్లక్ష్యం చేస్తుందంటూ బీజేపీపై విమర్శలు చేస్తూ ఇప్పటికే కొన్ని పార్టీలు ఎన్డీఏ నుంచి తప్పుకున్నాయి. ఇటీవలే ఆర్ఎస్ఎల్పీ ఎన్డీఏ నుంచి తప్పుకుని బీహార్ లో కాంగ్రెస్ కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. అది మర్చిపోకముందే..ఉత్తరప్రదేశ్ లోని అప్నాదళ్ పార్టీ నేత, కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ బీజేపీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. చిన్న పార్టీలకు బీజేపీ గౌరవం ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలిస్తే ఎన్డీఏకు ఎదురుదెబ్బ తగులుతుందని అప్నాదళ్ చీఫ్ ఆశిష్ పటేల్ ఇప్పటికే కామెంట్స్ చేశారు. ఈరోజు కేంద్రమంత్రిగా ఉన్న అనుప్రియా పటేల్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఎన్డీఏ నుంచి అప్నాదళ్ వైదొలగడం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News