బ్రేకింగ్ : తెలంగాణలో మరో మూడు కేసులు.. ఇద్దరు డాక్టర్లు

తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరుకుంది. ఇద్దరు వైద్యులకు కరోనా [more]

Update: 2020-03-26 08:44 GMT

తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరుకుంది. ఇద్దరు వైద్యులకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు భార్యాభర్తలు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. వైద్యులకు సరైన సౌకర్యాలు కల్పిస్తున్నా వైద్యులకు కరోనా సోకటం పై ఆందోళన వ్యక్తమవుతోంది. దోమలగూడ ప్రాంతంలో నివసిస్తున్న ఈ వైద్యులకు కరోనా సోకడంతో ఆ ప్రాంతంలో శానిటైజేషన్ చేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించేందుకు సిద్ధమయింది.

Tags:    

Similar News