ఆ నాలుగు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

ఆంధ్రప్రదేశ్ లో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ [more]

Update: 2021-02-12 02:01 GMT

ఆంధ్రప్రదేశ్ లో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి ప్రస్తుతం రాము సూర్యారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజవకవర్గానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. దీనిని ఎఎస్ రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమలులోకి రానుంది.

Tags:    

Similar News