బ్రేకింగ్ : ఎల్వీకి జగన్ ఝలక్

చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాపట్ల హెచ్ఆర్డీ డైరెక్టర్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేశారు. ఇన్ ఛార్జి చీఫ్ [more]

Update: 2019-11-04 10:45 GMT

చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాపట్ల హెచ్ఆర్డీ డైరెక్టర్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేశారు. ఇన్ ఛార్జి చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను ప్రభుత్వం నియమించింది. కాగా ఎల్వీ సుబ్రహ్మణ్యం వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. గత ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయననే కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే తన పేషీలోని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కు ఇటీవల ఎల్వీ సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీసు జారీ చేయడంతో జగన్ ఎల్వీ పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. అందుకోసమే ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగన్ ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేసినట్లు తెలిసింది.

Tags:    

Similar News