Amaravathi : రెండో రోజు ప్రారంభమైన యాత్ర

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్ర రెండో రోజు కొనసాగనుంది. ఈరోజు తాడికొండ నుంచి బయలుదేరనుంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రాజధాని రైతులు న్యాయస్థానం టు [more]

Update: 2021-11-02 02:32 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్ర రెండో రోజు కొనసాగనుంది. ఈరోజు తాడికొండ నుంచి బయలుదేరనుంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రాజధాని రైతులు న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. తుళ్లూరు నుంచి తిరుపతి వరకూ 45 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర రెండో రోజు 12.6 కిలోమీటర్లను పూర్తి చేయనున్నారు. గుంటూరు జిల్లా శివారు ప్రాంతాల్లో రాత్రి బస చేయనున్నారు.ఈ యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News