బుల్లితెర యాంకర్ న్యూసెన్స్..!

మ్యాచ్ చూడటానికి వచ్చి స్టేడియంలో న్యూసెన్స్ చేసిన తెలుగు యాంకర్ ప్రశాంతితో పాటు ఆమె మిత్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ [more]

Update: 2019-04-22 06:11 GMT

మ్యాచ్ చూడటానికి వచ్చి స్టేడియంలో న్యూసెన్స్ చేసిన తెలుగు యాంకర్ ప్రశాంతితో పాటు ఆమె మిత్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ కు ప్రశాంతితో పటు ఆమె మిత్రులు వచ్చారు. వీఐపీ బాక్స్ గ్యాలరీలో కూర్చున్న వీరు నానా రచ్చ చేశారు. వారి పక్కనే మ్యాచ్ చూస్తున్న ఓ వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ప్రశాంతితో పాటు ఆమె ఐదుగురు మిత్రులపై సదరు వ్యక్తి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో ప్రశాంతి, ఆమె మిత్రుల చర్యలు పరిశీలించిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News