Tdp : మైకు ఇవ్వవద్దంటే ఎలా?

ప్రివిలేజ్ కమిటీకి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలకు మైకు ఇవ్వననడం సరికాదన్నారు. అచ్చెన్నాయుడు, నిమ్మలరామానాయుడులకు శాసనసభలో మైకు ఇవ్వవద్దంటూ [more]

Update: 2021-09-23 03:13 GMT

ప్రివిలేజ్ కమిటీకి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలకు మైకు ఇవ్వననడం సరికాదన్నారు. అచ్చెన్నాయుడు, నిమ్మలరామానాయుడులకు శాసనసభలో మైకు ఇవ్వవద్దంటూ ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ కు సిఫార్సు చేయడాన్ని అనగాని సత్యప్రసాద్ తప్పుపట్టారు. గతంలో వైసీపీ నేతలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి గందరగోళం సృష్టించిన విషయాన్ని మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడే హక్కు ఉందన్నారు. ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని అనగాని సత్యప్రసాద్ కోరారు.

Tags:    

Similar News