ధర్నాకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే

Update: 2018-05-12 02:21 GMT

తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. తమ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, తమపై దాడికి పాల్పడిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయలేదని నిరసిస్తూ ఆమె ధర్నాకు దిగారు. నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై తిరుపతిలోని అలిపిరి వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసింే. అయితే ఈ సంఘటనలో టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి బీజేపీ నేతలు కోలా ఆనంద్, అతని అనుచరులను పోలీసులు వదలేశారని ఆమె ఆరోపిస్తున్నారు.

Similar News