రాష్ట్రపతి భవన్ కు ట్రంప్

రాష్ట్రపతి భవన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు చేరుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఇచ్చే విందులో ట్రంప్ దంపతులు పాల్గొన్నారు. ట్రంప్ దంపతులకు [more]

Update: 2020-02-25 14:30 GMT

రాష్ట్రపతి భవన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు చేరుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఇచ్చే విందులో ట్రంప్ దంపతులు పాల్గొన్నారు. ట్రంప్ దంపతులకు రామ్ నాధ్ కోవింద్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ ప్రత్యేకతలను ట్రంప్ కు ఆయన తెలియ జేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మొత్తం 8 మంది ముఖ్యమంత్రులు ఈ విందు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్ ను ట్రంప్ దంపతులు కలియతిరిగారు. ట్రంప్ రాక సందర్భంగా రాష్ట్రపతి భవన్ ను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. రాష్ట్రపతి భవన్ వద్ద ఉన్న బుద్ధుడి విగ్రహం వద్ద ట్రంప్ దంపతులు ఫొటోలు దిగారు. రాత్రి పదిగంటలకు ట్రంప్ దంపతులు తిరిగి అమెరికాకు బయలుదేరి వెళతారు.

Tags:    

Similar News