నేడు సీబీఐ ఎదుటకు ఆమంచి కృష్ణమోహన్

వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ నేడు సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. న్యాయమూర్తులను దూషించిన కేసులో ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల [more]

Update: 2021-02-12 00:44 GMT

వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ నేడు సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. న్యాయమూర్తులను దూషించిన కేసులో ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరినా, ఆమంచి సమయం కోరడంతో 12వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది. దీంతో ఈరోజు విశాఖలో సీీబీఐ ఎదుట ఆమంచి కృష్ణమోహన్ హాజరు కానున్నారు. తాను న్యాయమూర్తులను దూషించలేదని ఆమంచి చెబుతున్నారు. తనకు న్యాయవ్యవస్థ అంటే గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News