వాటిని కోవిడ్ కేంద్రాలుగా మార్చండి

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని చిత్తూరు జల్లాలో పర్యటించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా తీవ్రత [more]

Update: 2021-05-09 00:51 GMT

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని చిత్తూరు జల్లాలో పర్యటించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా తీవ్రత తగ్గడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆళ్ల నాని అధికారులతో చర్చించారు. ఇంజక్షన్ల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఆక్సిజన్ పై ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని ఆళ్ల నాని సూచించారు. కుప్పం నియోజకవర్గంలో వెంటిలేటర్లను పెంచాలని ఆళ్ల నాని ఆదేశించారు. గురుకులాలను కోవిడ్ కేంద్రాలుగా మార్చాలని ఆళ్ల నాని సూచించారు.

Tags:    

Similar News