నిరుద్యోగులకు తీపికబురు

Update: 2018-06-07 11:45 GMT

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇటీవల భారీ సంఖ్యలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భార్తీకి విడుదలైన నోటిషికేషన్ లో వయోపరిమితిని మూడేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీసు శాఖ సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2015లో వచ్చిన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ లో కూడా మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఇచ్చారు. కానీ, ఈ నోటిఫికేషన్ లో మొదట ఎటువంటి సడలింపు ప్రకటించలేదు. దీంతో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. ధర్నాలు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అదనంగా సుమారు 30 వేల మందికి పోటీ పడే అవకాశం లభించనుందని అంచనా.

Similar News