భవానీ కన్నీటి పర్యంతం

టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శాసనసభలో కన్నీటి పర్యంత మయ్యారు. తాను నిన్న సభలో మద్యం పై మాట్లాడితే సోషల్ మీడియాలో కొందరు తనపై అసభ్యకరమైన పోస్టులు [more]

Update: 2019-12-17 05:41 GMT

టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శాసనసభలో కన్నీటి పర్యంత మయ్యారు. తాను నిన్న సభలో మద్యం పై మాట్లాడితే సోషల్ మీడియాలో కొందరు తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. తన తండ్రి ఎర్రన్నాయుడు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల గొంతుకనే శాసనసభలో విన్పిస్తానని ఆదిరెడ్డి భవానీ అన్నారు. తాను ఏపీలో మద్య నిషేధాన్ని చేస్తానని చెప్పిన ప్రభుత్వం కొన్ని బ్రాండ్లు అందుబాటులో లేకుండా చేసి, మద్యం ధరలను పెంచడంతో పేదలు మరింత ఇబ్బందిపడుతున్నానని మాత్రమే అన్నానని ఆదిరెడ్డి భవానీ తెలిపారు. మద్యం పై మాట్లాడే హక్కు మహిళలకు లేదా? అని ప్రశ్నించారు. తనపై అసభ్యకరమైన పోస్టలు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ఆదిరెడ్డి భవానీ డిమాండ్ చేశారు. దీనికి హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ దిశ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags:    

Similar News