Andhra : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు కష్టాలే

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ చిక్కుల్లో పడ్డారు. ఆయనకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదిమూలపు సురేష్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో సీబీఐ దర్యాప్తు [more]

Update: 2021-10-08 05:52 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ చిక్కుల్లో పడ్డారు. ఆయనకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదిమూలపు సురేష్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో సీబీఐ దర్యాప్తు చేయవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. వెంటనే ఆదిమూలపు సురేష్ కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మంత్రి ఆదిమూలపు సురేష్ ఆయన భార్య, ఐఆర్ఎస్ అధికారిణి విజయలక్ష్మిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదయింది. సుప్రీంకోర్టు తీర్పుతో సీబీఐ ఇక విచారణ ప్రారంభించనుంది.

Tags:    

Similar News