స్వంత ఇంటికి వచ్చినట్లుంది..!

తనను రాజకీయ బిక్ష పెట్టిన వైఎస్ఆర్ కుటుంబంతో కలిసి నడవాలని అనుకుంటున్నట్లు ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ పేర్కొన్నారు. గురువారం ఆమె కుమారుడితో కలిసి వైఎస్ [more]

Update: 2019-03-07 11:50 GMT

తనను రాజకీయ బిక్ష పెట్టిన వైఎస్ఆర్ కుటుంబంతో కలిసి నడవాలని అనుకుంటున్నట్లు ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ పేర్కొన్నారు. గురువారం ఆమె కుమారుడితో కలిసి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జయసుధా మాట్లాడుతూ… తనను వైఎస్ఆర్ రాజకీయాలకు పరిచయం చేసి ప్రతీకూల పరిస్థితుల్లో ఎంతమందికి బుజ్జగించి సికింద్రాబాద్ టిక్కెట్ ఇప్పించి గెలిపించారని పేర్కొన్నారు. తర్వాత వైఎస్ కుటుంబంతోనే ఉండాలనుకున్నా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా తనకు ఉన్న బాధ్యతల నేపథ్యంలోనే అప్పుడు కాంగ్రెస్ లో ఉండాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా వైఎస్ కుటుంబంతో ఉండాలనే వైసీపీలో చేరానని పేర్కొన్నారు. వైసీపీలోకి రావడం స్వంత ఇంటికి వచ్చినట్లు ఉందన్నారు. ప్రస్తుతానికి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని, అయితే, జగన్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని చెప్పారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

Tags:    

Similar News