Achennaidu : ఓటు వేయకపోతే దాడులు చేస్తారా?

పరిషత్ ఎన్నికల్లో ఓటు వేయలదేని దళితులపై వైసీపీ నేతలు దాడులు చేయడమేంటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా మద్దలకట్టలో దళితులపై జరిగిన దాడులను [more]

Update: 2021-10-17 08:39 GMT

పరిషత్ ఎన్నికల్లో ఓటు వేయలదేని దళితులపై వైసీపీ నేతలు దాడులు చేయడమేంటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా మద్దలకట్టలో దళితులపై జరిగిన దాడులను ఆయన ఖండించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 158 దళిత కుటుంబాలపై దాడులు జరిగాయని అచ్చెన్నాయుడు అన్నారు. అధికారాన్ని ఇచ్చిన దళితులపైనే వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారన్నారు. ఎస్సీలు వ్యతిరేకం అవుతుండటంతో ఓర్చుకోలేక అధికార పార్టీ నేతలు దాడులకు దిగుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

Tags:    

Similar News