Achennaiudu : రూపాయికి పడిపోయినా పట్టించుకోరా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందన్నారు. టమోటా, మిర్చిధరలు పతనమై [more]

Update: 2021-09-23 03:19 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందన్నారు. టమోటా, మిర్చిధరలు పతనమై రైతులు ఆందోళనలో ఉన్నారని అచ్చెన్నాయుడు ఆవేదన చెందారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత జగన్ పై ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు. టమోటా రూపాయి పలుకుతుండటంతో పంటను రైతులు రోడ్లపై పారబోస్తున్నారన్నారు. పచ్చి మిర్చి ధర కిలో మూడు రూపాయలకు పడిపోయిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News