Achennaidu : చంద్రమండలంలో దాక్కున్నా వదిలపెట్టబోం

వైసీపీ నేతల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. గుంటూరు జిల్లాలో [more]

Update: 2021-09-21 05:25 GMT

వైసీపీ నేతల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. గుంటూరు జిల్లాలో వినాయక చవితి సందర్భంగా వైసీపీ నేతలు టీడీపీ మాజీీ జడ్జీటీసీ బత్తిన శారద ఇంటిపై దాడులు చేయడాన్ని ఆయన తప్పపట్టారు. దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, తప్పుచేసిన వారు చంద్రమండలంలో దాక్కున్నా వదిలపెట్టే ప్రసక్తి లేదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. వైసీీపీ మూకల దాడులను ప్రోత్సహిస్తున్నందుకే వారికి అవార్డులు వస్తున్నాయా? అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News