సీఎం జగన్ కు అచ్చెన్న సవాల్

సీఎం జగన్ కు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. పోలీసుల రక్షణ లేకుండా వైసీపీ నేతలు ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నారన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి [more]

Update: 2020-05-28 07:51 GMT

సీఎం జగన్ కు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. పోలీసుల రక్షణ లేకుండా వైసీపీ నేతలు ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నారన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ దొంగమాటలు చెబుతున్నారన్నారు. ఏ గ్రామనికైనా తాను వస్తానని చర్చకు సిద్ధమేనా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల దగ్గర నుంచి అన్ని పథకాలను వైసీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని, వాలంటీర్ల వ్యవస్థను అందుకు వినియోగించుకుంటున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. ఈ నెల 30వ తేదీకి జగన్ పాలన ఏడాది అవుతుందని, ఆ సందర్భంగా చర్చకు ఎక్కడైనా తాను సిద్ధమని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.

Tags:    

Similar News