8 ట్రంక్ పెట్టెల్లో కిలోల కొద్దీ బంగారం.. వెండి

అనంతపురంలో ట్రెజరీ శాఖ లో అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తున్న మనోజ్ ఆస్తులు లెక్క వేసి అధికారులే నోళ్లు వెళ్లబట్టారు. తన కారు డ్రైవర్ ఇంట్లో ఎనిమిది [more]

Update: 2020-08-19 04:43 GMT

అనంతపురంలో ట్రెజరీ శాఖ లో అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తున్న మనోజ్ ఆస్తులు లెక్క వేసి అధికారులే నోళ్లు వెళ్లబట్టారు. తన కారు డ్రైవర్ ఇంట్లో ఎనిమిది ట్రంక్ పెట్టెలు బయటపడటంతో గుట్టుబయట పడింది. మనోజ్ ఆస్తుల లెక్కల చిట్టాను తేల్చారు. 2.4 కిలోల బంగారం, 84 కిలోల వెండి, 15.55 లక్షల నగదును ట్రంక్ పెట్టెల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతోపాటు 49 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్లు, 27 లక్షల ప్రామిసరీ నోట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మనోజ్ కు నాలుగు అధునాతనమైన బైక్ లతో పాటు నాలుగు ట్రాక్టర్లు, రెండు అధునాతనమైన కార్లు ఉన్నాయని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Tags:    

Similar News