ఏబీ వెంకటేశ్వరరావు కేసు సుప్రీంకోర్టులో

ఏపీ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే నాట్ బిఫోర్ మి కింద జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు [more]

Update: 2020-11-03 06:34 GMT

ఏపీ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే నాట్ బిఫోర్ మి కింద జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు ధర్మాసనం పక్కకు తప్పుకున్నారు. ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించాలని కోరింది. కానీ నాట్ బిఫోర్ మి అంటూ జస్టిస్ నాగేశ్వరరావు చెప్పడంతో కేసు విచారణ వాయిదా పడింది.

Tags:    

Similar News