వారందరిపై ఏబీ పరువు నష్టం దావా

ఏపీ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తనపై ఫిర్యాదు చేసిన వారిపై పరువు నష్టం దావా వేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు సాక్షి మీడియా, [more]

Update: 2021-08-02 13:23 GMT

ఏపీ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తనపై ఫిర్యాదు చేసిన వారిపై పరువు నష్టం దావా వేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు సాక్షి మీడియా, సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తితోసహా ఏడుగురికి ఏబీ వెంకటేశ్వరరావు నోటీసులు జారీ చేశారు. వీరి కారణంగానే తన డిస్మిస్ కు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. న్యాయ మార్గం ద్వారానే వైసీపీిని కట్టడి చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు భావిస్తున్నారు.

Tags:    

Similar News