Amaravathi : పాదయాత్రకు నేడు విరామం

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు నేడు విరామం ప్రకటించారు. పాదయాత్ర వెళుతున్న గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఉండటంతో ఎన్నికల నిబంధనల మేరకు యాత్రకు [more]

Update: 2021-11-13 02:17 GMT

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు నేడు విరామం ప్రకటించారు. పాదయాత్ర వెళుతున్న గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఉండటంతో ఎన్నికల నిబంధనల మేరకు యాత్రకు విరామాన్ని ప్రకటించారు. నిజానికి నేడు 13వ రోజు పాదయాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే ప్రకాశం జిల్లాలోని యరజర్ల గ్రామం నుంచి ప్రారంభమై నిడమానూరులో రాత్రి బస చేయాల్సి ఉంది.

వార్డు ఎన్నికలు….

కానీ నిడమానూరు పంచాయతీలో ఒక వార్డుకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బయట వ్యక్తులు ఎవరూ గ్రామంలో ప్రవేశించడానికి వీలులేదన్న నిబంధనలు ఉండటంతో పాదయాత్రను రైతులు నిలిపివేశారు. ఆదివారం నుంచి యాత్ర కొనసాగుతుందని చెప్పారు.

Tags:    

Similar News