క్షేమంగానే అమర్త్యసేన్ : కుటుంబ సభ్యులు

ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్‌ క్షేమంగానే ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Update: 2023-10-10 12:43 GMT

అమర్త్యసేన్‌ క్షేమంగానే ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అమర్త్యసేన్ కుమార్తె నందన తన తండ్రి మరణవార్తను ఖండించారు. ఆయన క్షేమంగానే ఉన్నారని తెలిపారు. నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్ మరణించినట్లు వార్తలు వచ్చాయి. జాతీయ మీడియాలోనూ ఈ వార్తలు ప్రముఖంగా కనిపించాయి.

వార్తలు నమ్మొద్దు...
అయితే ఆయన కుమార్తె నందన ఈ వార్తలను ఖండించారు. ఆయన క్షేమంగానే ఉన్నారని నందన తెలిపారు. అమర్త్యసేన్ మరణించారంటూ వచ్చిన వార్తలు నమ్మవద్దని ఆమె కోరారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. అమర్త్యసేన్‌ మరణించారంటూ ఆంగ్ల మీడియాలో, సోషల్‌ మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై ఆమె స్పష్టత ఇచ్చారు


Tags:    

Similar News