మరోసారి తండ్రి కాబోతోన్న ప్రముఖ నిర్మాత

కరోనా లాక్ డౌన్ సమయంలో 2020, మే10న దిల్ రాజు వైఘా రెడ్డి(తేజస్విని) మెడలో మూడు వేశారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్..

Update: 2022-03-22 11:15 GMT

హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారా ? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. 2017లో తన మొదటి భార్య శిరీష అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో.. రెండేళ్లు దిల్ రాజు కుంగిపోయాడు. తండ్రిని అలా చూడలేని కూతురు హన్షితరెడ్డి.. వైఘా రెడ్డి(తేజస్విని)తో రెండో వివాహం జరిపించింది. కరోనా లాక్ డౌన్ సమయంలో 2020, మే10న దిల్ రాజు వైఘా రెడ్డి(తేజస్విని) మెడలో మూడు వేశారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉందని అప్పట్లో పలు వార్తలు కూడా వచ్చాయి.

ప్రస్తుతం దిల్ రాజు భార్య తేజస్విని నిండు గర్భిణీ అని, త్వరలోనే ఈ దంపతులు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని టాలీవుడ్ టాక్. ఈ వార్తపై దిల్ రాజు కుటుంబం నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా.. నిజమేనంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇక ఇప్పటికే హన్షిత రెడ్డి కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాత అయ్యాక దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నాడు అన్నమాట. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా , డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నాడని తెలిసి నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు.

Tags:    

Similar News