మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నాడు

Update: 2018-04-28 06:04 GMT

ప్రస్తుతం మంచు విష్ణు టైం ఏమి అంతగా బాగాలేదని నిన్న విడుదలైన 'ఆచారి అమెరికా యాత్ర' బట్టి తెలుస్తుంది. సినిమాలో విషయం లేకపోవడంతో జనాలతో పాటు రివ్యూయర్స్ కూడా సినిమాకు నెగటివ్ కామెంట్స్ వేశారు. తాను సెలెక్ట్ చేసుకునే డైరెక్టర్స్ వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నాడేమో.

అయితే ఈ నేపధ్యంలో మంచు విష్ణు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు టాక్. తానే స్వయంగా ఓ సినిమా చేయాలనీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. తన సొంత బ్యానర్ మీద 25 కోట్ల దాకా బడ్జెట్ కేటాయించి సినిమాను తీయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అందుగాను రాజమౌళి తండ్రి నుండి ఓ కథను కోటి రూపాయలకు పెట్టి కొన్నట్టు తెలుస్తుంది.

ఇండో పాక్ సరిహద్దు వివాదం నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతోందని వినికిడి. ఇది పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్ధమవుతుంది. వేరే డైరెక్టర్స్ ని నమ్మడం ఎందుకులే అని తనే డైరెక్ట్ చేయాలని డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే విష్ణు తీసుకున్న డెసిషన్ పై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. పాతిక కోట్లు పెట్టి సినిమా తీసే దమ్ము విష్ణుకి ఉందా? అంత సాహసం చేయగలడా? అసలే ఫెయిల్యూర్ లో విష్ణు ఇటువంటి నిర్ణయం తీసుకోవటం ఏంటి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలు ఎక్కిదో ఇంకా తెలియాల్సి ఉంది.

Similar News