అరవై ఏళ్ల వృద్ధుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష

నంద్యాల కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అరవై ఏళ్ల వృద్ధుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది

Update: 2022-08-11 12:23 GMT

నంద్యాల కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అరవై ఏళ్ల వృద్ధుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాలికపై అత్యాచారం కేసులో ఈ శిక్ష విధించింది. పుల్లయ్య అనే అరవై ఏళ్ల వ్యక్తి తన మనవరాలు వయసు ఉన్న బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో జడ్జి ఈ తీర్పు చెప్పారు. ప్రస్తుతం ఆ వృద్ధుడి వయసు అరవై ఏళ్లు.

వరసకు మనవరాలు...
పుల్లయ్య అనే వృద్ధుడు తనకు వరసకు మనవరాలు అయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 2019లో ఈ ఘటన జరిగింది. కోవెలకుంట్ల మండలం ఉప్పులూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. 2019లో పుల్లయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్ల విచారణ అనంతరం పుల్లయ్యకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష నంద్యాల కోర్టు విధించింది.


Tags:    

Similar News