ఢిల్లీలో కిరణ్ బిజీ

ఢిల్లీలో కిరణ్ కుమార్‌ రెడ్డి నేతలతో వరసగా సమావేశాలు అవుతున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు

Update: 2023-04-08 12:31 GMT

ఢిల్లీలో కిరణ్ కుమార్‌ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత నేతలతో వరసగా సమావేశాలు అవుతున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో నల్లారి భేటీ అయి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చర్చించినట్లు తెలసిింది. దాదాపు నలభై నిమిషాలకు పైగా అమిత్ షాతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చర్చించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాజకీయాలపై చర్చించినట్లు చెబుతున్నారు. త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో తెలుగువారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో కిరణ‌్ ను ప్రచారానికి వెళ్లాలని కూడా అమిత్ షా సూచించినట్లు చెబుతున్నారు.

వరస భేటీలతో...
అనంతరం బీఎల్ సంతోష్‌తో కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు కర్ణాటక ఎన్నికల్లో పనిచేయాలని బీఎల్ సంతోష్ కూడా కోరినట్లు తెలిసింది. అటు తర్వాత మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ కండువాను కప్పుకున్న తర్వాత ఢిల్లీలో బిజీ అయ్యారు.


Tags:    

Similar News