Tue Feb 03 2026 08:33:51 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశం
అమరావతిలో నేడు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది

అమరావతిలో నేడు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు రెవెన్యూ, ఐటీ శాఖలపై చర్చించనున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖలపై ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన విషయాలపై కూడా చర్చించనున్నారు.
ఎస్పీలతో ప్రత్యేకంగా...
దీంతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతలపై జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ లతో కూడా సమావేశమై చర్చించనున్నారు. ఈ సమావేశంలో గంజాయి, డ్రగ్స్ ను అరికట్టడంతో పాటు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, మహిళలపై అత్యాచార ఘటనలపై చంద్రబాబు నాయుడు ఎస్పీలతో ప్రత్యేకంగా చర్చించే అవకాశముంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో్ జరుగుతున్న దుష్ప్రచారంపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించనున్నారు.
Next Story

